సిద్ధం సభలకు YCP అన్ని కోట్లు ఖర్చు చేసిందా..? కీలక విషయాలు బయటపెట్టిన షర్మిల

by Disha Web Desk 19 |
సిద్ధం సభలకు YCP అన్ని కోట్లు ఖర్చు చేసిందా..? కీలక విషయాలు బయటపెట్టిన షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నేపథ్యంలో ‘సిద్ధం’ పేరుతో వైసీపీ నిర్వహిస్తోన్న బహిరంగ సభలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. జగన్ సిద్ధం సభలకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారని.. ఈ జనాన్ని చూస్తేనే జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. గ్రీన్ కలర్ మ్యాట్‌లతో సభకు జనం రాకున్న గ్రాఫిక్స్‌తో అధికార పార్టీ మాయ చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ సిద్ధం సభలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. ఆ పార్టీకి ఇంత డబ్బు ఎక్కడ నుండి వస్తుందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధం సభలకు ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారంట అని షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో సిద్ధం సభలు నిర్వహిస్తున్నారా.. లేక వైసీపీ పార్టీ ఫండ్‌తో సభలు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును వైపీసీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.

Next Story